రాజధానిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య

Published: Friday November 20, 2020

విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోను పోలీసులు అడ్డుకున్న కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అఫిడవిట్‌లో ప్రభుత్వానిది మతిలేని చర్య అని పేర్కొనడాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు. వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అమరావతి రాజధానిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. à°ˆ సందర్భంగా రాజకీయాల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. నేరచరిత్ర కలిగిన వారినుంచి వ్యవస్థలను కాపాడాలని ధర్మాసనం స్పష్టం చేసింది.