సీఎం జగన్ క్లాస్ ఎఫెక్ట్

Published: Friday November 27, 2020

 à°µà°¾à°°à°¿à°¦à±à°¦à°°à± అధికార పార్టీ నేతలు. à°† విషయం మరిచిపోయి ఘర్షణ పడ్డారు. పార్టీ పరువు బజారున పడడంతో ఇద్దరిని పిలిచి సీఎం జగన్ క్లాస్ పీకారు. ఇప్పుడు à°† ఇద్దరు నేతలు ఒకే చోటకు చేరి కార్యకర్తల్లో జోష్ నింపారు.

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి ఆహ్వానించారు. బోస్ ఇంటికి రాగానే లోపలికి రావాలంటూ ద్వారంపూడి స్వాగతం పలికారు. à°ˆ భేటీకి మీడియాను పిలవలేదని ఒక్క సాక్షిని మాత్రమే పిలిచినట్లు బోస్‌కు ద్వారంపూడి వివరించారు. ప్రజల కోసం à°ˆ భేటీ ఫొటోలు తీస్తున్నట్లు ద్వారంపూడి తెలిపారు. సీఎం జగన్ సూచన మేరకు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. బోస్‌తో సమావేశానికి కొందరు బీసీ నేతలను కూడా ద్వారంపూడి ఆహ్వానించారు.

సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎంపీ బోస్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి దుర్భాషలాడారు. నువ్వెవడ్రా.. పోరా! అంటూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం జగన్.. క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి ఇద్దరికి క్లాస్ ఇచ్చారు.