అవయవ దానంతో నలుగురికి...... ఆదర్శం.. మరికొందరికి ప్రాణదాత

Published: Thursday May 31, 2018

 

హైదరాబాద్ : కన్న కూతురు మౌనిక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె తల్లి దండ్రులు కూతురి అవయవదానానికి ఒప్పు కొని మరికొందరికి ప్రాణదాతగా నిలిచినట్టయ్యింది. à°¨à°²à±à°—ొండ జిల్లా పానగల్‌ బైపాస్‌ రోడ్డుపై à°—à°¤ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మౌనికకు తీవ్రంగా గాయాలు కాగా బ్రెయిన్‌ డెడ్‌తో కోమాలోకి వెళ్లింది.తమ పెద్ద కూతురైన మౌనిక కోమాలో నుంచి బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మల్లిబాబు, లలిత ఎంతో కుమిలిపోయారు. à°ˆ లోకం నుంచి తమ కూతురు వెళ్లిపోయినా ప్రాణా పాయంలో ఉన్న మరి కొందరినైనా అవయవ దానంతో బతికించాలన్న ఉద్దేశ్యంతో జీవన్‌ దాన్‌ సంస్థ ద్వారా అవయవదానం చేయాలని నిర్ణయిం చారు. సరూర్‌నగర్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రి లో జీవన్‌ దాన్‌ సంస్థ ద్వారా తమ కూతురు మౌనిక అవయవాలను దానం చేసి మాన వతా విలువలు చాటుకున్న తల్లిదండ్రులుగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు..