టీచర్ల బదిలీలపై టీడీపీ రెచ్చగొడుతోంది

Published: Tuesday December 15, 2020

టీచర్ల బదిలీలపై టీడీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  వ్యాఖ్యానించారు.  టీడీపీ హయాంలో బదిలీలు జరిగినప్పుడు జిల్లాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడి ఎవరు సస్పెండ్ అవుతారో అని భయపడే పరిస్థితి నెలకొందని.. ఇప్పుడు మా హయాంలో అంతా పారదర్శకతతోనే నడుస్తోందని  ఆయన పేర్కొన్నారు. ఖాళీలు బ్లాక్ చేయటం ఇప్పుడు కొత్తేమి కాదని తెలిపారు. మేము ఏదీ దాచడం లేదు... బ్లాక్ చేసిన వివరాలు కూడా వెల్లడిస్తున్నామని ఆదిమూలపు సురేష్  చెప్పారు. మొత్తం నాలుగు కేటగిరిల్లో 16008ఖాళీలు బ్లాక్ చేశారని  ఆయన అన్నారు. ఆప్షన్ పెట్టుకునేందుకు ఖాళీలు మొత్తం 32889 ఉన్నయని... వెబ్ ఆప్షన్ కోసం మరొక రోజు అవకాశం ఇస్తాం అని మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు చర్చించాం.. మంచి  సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు. మాన్యూవల్ తోనే ఇబ్బందులు వస్తున్నాయని ఆదిమూలపు సురేష్  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±.