ప్రముఖ దివంగత నటి శ్రీదేవి మరణించినా ఆమె జ్ఞాపకాలు అభిమానులను వీడటం లేదు.

Published: Friday June 01, 2018

శ్రీదేవి నటనలోనే కాదు పెయింటింగులు వేయడంలోనూ అపార ప్రతిభ కనబర్చారనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.అయితే తన భార్య శ్రీదేవి వేసిన అద్భుత పెయింటింగులతో ముంబై నగరంలో ఓ ఎగ్జిబిషన్ నిర్వహించాలని భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ నిర్ణయించారు. శ్రీదేవి వేసిన పెయింటింగును 2010లో లండన్ నగరంలోని ప్రతిష్ఠాత్మక క్రీస్టీలో నిర్వహించిన వేలంలో రూ.22లక్షలకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. శ్రీదేవి వేసిన పలు పెయింటింగులు ప్రస్థుతం ఇంట్లో ఉన్నాయి. మరికొన్ని పెయింటింగులను తన దగ్గరి స్నేహితులు, బంధువులకు శ్రీదేవి బహుమతిగా అందజేసింది. విశిష్ట పెయింటరుగా శ్రీదేవి వేసిన పెయింటింగులను సేకరించి ఆమె జ్ఞాపకార్థం ఎగ్జిబిషన్ నిర్వహించడానికి బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నారు.