జగన్‌కు సోము వీర్రాజు లేఖ

Published: Wednesday December 30, 2020

సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జీఓ 77ను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 77 జారీ చేయడం ద్వారా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకున్న à°ˆ నిర్ణయం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు తెస్తామన్న మార్పు ఇదేనా అని వీర్రాజు ప్రశ్నించారు. à°ˆ జీఓను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. జగనన్న వసతి, విద్యాదీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రలు అప్పులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని, అందువల్ల విదేశీ విద్యాదీవెన కూడా వెంటనే ప్రారంభించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.