ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర విషాదం

Published: Saturday January 09, 2021

ఏలూరు: ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం రేలంగి శివారు గవర్లపాడులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా టెంటుపై కొబ్బరి చెట్టు కూలి పడింది. à°ˆ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదుగురికి గాయాలయ్యాయి. మృతులు భవాని(24), శాంతి(35)à°—à°¾ గుర్తించారు. క్షతగాత్రులు తణుకు ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు  ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు