ఎన్నికల్లో పాల్గొంటామని ఎన్జీవోస్ ప్రకటన

Published: Tuesday January 26, 2021

పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటామని ఏపీ ఎన్జీవోస్ ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ సమావేశం అయ్యారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారు. వీలైనంత త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే.. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎస్‌ను కోరాం. సీఎస్ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటాం. ఎస్ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తాం’ అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.