ఎస్‌ఈసీ కులపిచ్చితో వ్యవహరిస్తున్నారు

Published: Friday January 29, 2021

కులపిచ్చితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులుండవని చెప్పారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.గతంలో నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు నిలిపివేశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.