ఈసారి పవర్ స్టార్‌తో చెప్పించారు

Published: Tuesday February 02, 2021

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ చమక్కులు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగించేందుకు.. చక్కని మీమ్స్‌తో అదరగొడుతున్నారు. తాజాగా చేసిన à°“ ట్వీట్‌లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కనిపించారు. పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ను ఉపయోగించుకుని సందేశాత్మక ట్వీట్ చేశారు. 

 

à°ˆ మధ్య కాలంలో ట్రాఫిక్ చలాన్లను తప్పించుకునేందుకు వాహనదారులు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా నంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కాలు అడ్డపెట్టడం, తమ దుస్తులతో నంబర్ ప్లేట్‌ను దాచిపెట్టడం, వంచడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం ద్వారా చలాన్ తప్పించుకోవచ్చని చాలా మంది భ్రమపడుతున్నారు. అయితే వాటికి చలాన్లు à°Žà°‚à°¤ ఉంటాయో తెయజేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. దీనికోసం పవన్‌ సినిమాతో మీమ్ రూపొందించారు.  

 

à°“ యువతి నంబర్ ప్లేట్‌కు కాలు అడ్డుపెట్టిన ఫొటోను షేర్ చేసిన పోలీసులు.. వాహన సమాచారాన్ని తెలియకుండా చేయడం, ట్రిపుల్ రైడింగ్, ప్రమాదకర ప్రయాణం తదితర కారణాలతో 2800 రూపాయలు ఫైన్ పడిన విషయాన్ని తెలియజేశారు. ఇదే విషయాన్ని పవన్‌‌తో సెటైరికల్‌à°—à°¾ చెప్పించారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని రైల్వే సీన్ నేపథ్యంలో ‘‘నువ్వేమో రూ.1300 కాపాడదాం అని కాలు పెట్టావ్... కానీ నువ్వు చేసిన à°ˆ పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి’’ అంటూ కామెంట్ పెట్టారు. à°ˆ ట్వీట్ వైరల్ అవుతోంది.