తమ్ముళ్లను కాపాడి..

Published: Tuesday June 05, 2018

మండల పరిధిలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సాయికిరణ్‌రెడ్డి (14) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు  ఊరచెరువులో పడి మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్‌ సూర్‌ తెలిపిన వివరా à°² ప్రకారం... పెద్ది జనార్దన్‌రెడ్డి- కవితలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయికిరణ్‌రె డ్డి, చిన్న కుమారుడు సాయికృష్ణారెడ్డి. సాయికిరణ్‌రెడ్డి హసన్‌పర్తి మండలం ఎస్పీఆర్‌ పాఠశాలలో 8à°µ తరగతి పూర్తి చేశారు. మరో రెం డు రోజులకు తిరిగి హాస్టల్‌కు వెళ్లడానికి సిద్ధ మవుతున్నాడు. కాగా, తన తమ్ముడు సాయికృష్ణారెడ్డితో పాటు చిన్నాన్న కుమారుడు పెద్ది ప్ర భాత్‌లు కలసి  గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్ద చెరువు కట్టపైకి సైకిల్‌పై వెళ్లా రు. à°ˆ క్రమంలో ముగ్గురు కలిసి చెరువులో à°•à°¾ ళ్లు కడుక్కోవడం కోసం చెరువు దగ్గరకు వెళ్లారు. గట్టు అంచున కూర్చుని కాళ్లు కడుక్కుంటుండగా చెరువులోకి జారి పోయారు. కాగా, సాయికిరణ్‌ రెడ్డి తన తమ్ముడితో పాటు పెద్ది ప్రభాత్‌ను గట్టుపైకి నెట్టాడు. తాను మాత్రం నీటిలోకి జారిపోయాడు. అన్న చెరువులో పడిమునిగిపోతున్నాడని చిన్నారులిద్దరూ కేకలు వే శారు. గమనించిన గ్రామస్థులు సంఘటనాస్థ లానికి చేరుకునేలోపే సాయికిరణ్‌ రెడ్డి నీటిలో మునిగి మృతిచెందాడు. కాగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, అతడి తండ్రి జనార్దన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సూరి తెలిపారు.