ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం

Published: Friday February 19, 2021

 à°…సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా ప్రస్తావన తీయలేదని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఏబీఎన్ డిబెట్‌లో ఆయన మాట్లాడుతూ కేవలం ప్రజలను మభ్య పెట్టాలను చూస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధానిగా గతంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం పరిస్థితుల ప్రభావమని చెప్పారు. ఏపీకి కేంద్రం అదనంగా నిధులు ఇస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీకి వెళ్లి చర్చించామని నరసింహరావు తెలిపారు.