వైసీపీ నేతల అధికార బలం...

Published: Monday March 15, 2021

వైసీపీ నేతల అధికార బలం... టీడీపీ నేతల్లో కొరవడిన సమన్వయం! ఫలితం... గుంటూరు నగరం వైసీపీ కైవశమైంది. à°ˆ నగరంలో గెలుపు కోసం అధికారపక్షం పకడ్బందీగా వ్యవహరించింది. అనుకున్నట్లుగానే... గుంటూరు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో  గెలు పు జెండా ఎగరవేసింది. నిజానికి... మాచర్ల, పిడుగురాళ్ల తరహాలోనే గుంటూరు నగరాన్ని కూడా ఏకగ్రీవంగా సొంతం చేసుకోవాలని భావించారు. టీడీ పీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించిన  కోవెలమూడి రవీంద్ర(నాని)ను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయన వ్యాపారాలను దెబ్బతీస్తామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

 

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఊహించిన నగర ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక... ధన ప్రవాహం సరేసరి. వైసీపీ మేయర్‌ అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండా.. ‘మీకే పదవి’ అంటూ ముగ్గురు, నలుగురికి ఆశపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశా రు. పారిశ్రామిక సంస్థల అసోసియేషన్‌à°² నుంచి కూడా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా పోగేసిన డబ్బు నుంచి ఒక్కో డివిజన్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు.  

 

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా... టీడీపీలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. సహజంగా ఉన్న బలంతోపాటు అమరావతి ఉద్యమం వంటి సానుకూల అస్త్రాలు ఉన్నప్పటికీ సమర్థంగా వాడుకోలేదు. టీడీపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్రతోపాటు పార్టీ అభ్యర్థులు తమ కష్టాలు తాము పడ్డారు. అధినేత చంద్రబాబు తనవంతుగా గుంటూరులో ప్రచారం చేసినప్పటికీ పార్టీ సీనియర్‌ నేతలెవరూ చొరవ తీసుకుని వీరికి à°…à°‚à°¡à°—à°¾ నిలబడలేదు. సమష్టి పోరాటం, సమన్వయం కనిపించలేదు. తగిన ప్రచార వ్యూహమూ రచించలేదు. దీని ఫలితంగా కేవలం 9 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ‘గెలవడం కష్టం’ అని ముందుగానే కాడి పడేయడంవల్లే గుంటూరులో దెబ్బతిన్నామని ఇప్పుడు పలువురు నేతలు వాపోతున్నారు. ఇక... గుంటూరు నగరపాలకసంస్థలో జనసేన-బీజేపీ అభ్యర్థులు 42 స్థానాల్లో పోటీ చేశారు. ఫలితాలను విశ్లేషించగా.. 12 డివిజన్లలో వైసీపీకి వచ్చిన ఆధిక్యతకంటే జనసేన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న భయం.. తెలుగు తమ్ముళ్ల నడుమ విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక.. వైసీపీ అధికార-ధన బలం! ఇవన్నీ కలిశాయి! విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ విజయానికి బాటలు వేశాయి. రాష్ట్రమంతా ఫలితం ఎలా ఉన్నా విజయవాడలో ఎక్స్‌అఫిషియో బలంతోనైనా టీడీపీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ... ఇక్కడా తెలుగుదేశానికి నిరాశే ఎదురైంది. నగరానికి చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు à°ˆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దేవినేని అవినాశ్‌ కూడా తన సత్తా చాటుకునేందుకు à°ˆ ఎన్నికలను à°“ వేదికగా చేసుకున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నా ఎక్కడా వాటిని బయటపడనివ్వలేదు. అందరూ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు రాష్ట్ర మంత్రులందరూ విజయవాడపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. దాదాపు కేబినెట్‌లోని మంత్రులందరూ విజయవాడలో ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆర్థిక దన్నుతోపాటు అధికార దన్ను తోడవడంతో వైసీపీ గెలుపు నల్లేరుమీద నడక అయింది