మంత్రి కేటీఆర్‌తో గంటా భేటీ

Published: Saturday March 20, 2021

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ à°Ÿà±€ బ్రేక్ సమయంలో à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో à°ˆ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. à°ˆ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి à°“ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు à°—à°‚à°Ÿà°¾ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై à°ˆ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానని à°—à°‚à°Ÿà°¾ à°† సందర్భంగా ప్రకటించారు. à°ˆ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అందరి మద్దతును కూడగడుతున్నారు