సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ లేఖతో రాష్ట్రం పరువు పోయింది!

Published: Friday March 26, 2021

 à°¸à±à°ªà±à°°à±€à°‚కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ నియామకాన్ని అడ్డుకోడానికి ఇంత పన్నాగమా? ఆయనపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు చేస్తారా’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం వైఎస్‌ జగన్‌పై ధ్వజమెత్తారు. జస్టిస్‌ రమణపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకు ముఖ్యమంత్రి రాసిన లేఖతో ఏపీ ప్రభుత్వం పరువు పోయిందన్నారు. దీనివల్ల రాజ్యాంగం, న్యాయవ్యవస్థలను గౌరవించేవారి ముందు చులకనయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంటులో అనేక మంది ఎంపీలు తనను కలిసి సీఎం లేఖ తీరును అభిశంసించారని తెలిపారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల కేసును హైకోర్టు కొట్టేసినా బుద్ధిరాలేదని.. జస్టిస్‌ రమణపై అవే ఆరోపణలతో సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు.

 

సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా à°’à°• తెలుగువాడు నియమితులైతే అందరం గర్వించాలన్నారు. ‘సీఎం సలహాదారు అజయ్‌రెడ్డి కల్లం.. జగన్‌ రాసిన లేఖను మీడియా ముందు బహిర్గతం చేశారు. ఇప్పుడేమైంది..? సీఎం లేఖలో పేర్కొన్న ఆరోపణలన్నీ ఆధారరహితంగా, చిల్లరగా, అసత్యాలు.. దురుద్దేశాలతో కూడుకుని ఉన్నాయని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించినట్లు à°’à°• ఆంగ్ల పత్రికలో వార్త వెలువడింది. ఇది సీఎంకు చెంపపెట్టు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు చెబితే.. ఆయన్ను రాజీనామా చేయాలని తమ పార్టీకి చెందిన కొందరు నేతలు, మంత్రులు  డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తే జగన్‌ ఆరోపణలు అబద్ధాలని తీర్పు చెప్పినందున.. సీఎంను కూడా రాజీనామా చేయమంటారేమోనని వ్యంగ్యంగా అన్నారు.

 

నాపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనందున నేను కూడా రాజీనామా చేయాలని సహచర ఎంపీలు నందిగం సురేశ్‌, రెడ్డప్ప అన్నారు. వారిద్దరూ నాపై అక్రమంగా పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. వారు à°† ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. నేనూ సీఎం జగన్‌రెడ్డిపై 33 చార్జిషీట్లు ఉన్నట్లు గుర్తు చేయాలా? నేను సీబీఐ నుంచి తప్పించుకోడానికే ఢిల్లీలో ఉన్నట్లు రెడ్డప్ప ఆరోపించారు. సీబీఐ ప్రధాన కేంద్రం ఉన్నది ఢిల్లీయేనన్న విషయం ఆయకు తెలియదేమో! సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం వెళ్లకుండా తప్పించుకుంటున్న సీఎం సంగతేంటి? ప్రతివారం ఏవో పథకాల ప్రారంభం, శంకుస్థాపనల నెపంతో ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి భయపడుతున్నట్లు అనుకోవాలా? జగన్‌పై ఉన్న చార్జిషీట్ల సంఖ్య కంటే ఒక్కటైనా అదనంగా.. అంటే నాపై 34 ఎఫ్‌ఐఆర్‌లు అక్రమంగా పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు’ అని రఘురామరాజు మండిపడ్డారు.

 

ఇసుక కొత్త పాలసీలో అనేక లొసుగులు ఉన్నాయన్నారు. గంగవరం రేవు ఒక తెలుగువ్యక్తి చేతుల నుంచి గుజరాతీల పరమవడం బాధనిపిస్తోందన్నారు. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు, తలలు వంచేస్తామని మాటిచ్చి.. ఇప్పుడు 22 మంది ఎంపీలను గెలిపించినా ఇచ్చిన మాట ప్రకారం మెడలు, తలలు వంచామని.. అయితే ఎవరి వద్ద ఎవరు మెడలు, తలలు వంచుతున్నారన్నదే ప్రశ్నార్థకమన్నారు.