మృగశిర కార్తె వచ్చింది.....చేపమందుకు రెడీ అవుతున్న ప్రజలు

Published: Friday June 08, 2018

నాంపల్లిః ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా వేసే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. చేప ప్రసాదాన్ని స్వీకరించిందుకు నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన పలువురు అస్తమా రోగులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కాగా మొత్తం 36 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంతేగాక ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మొత్తం 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు.