ఎక్కడికక్కడే నిలిపేసిన రైళ్ళు...............

Published: Saturday June 09, 2018

అరకు(విశాఖపట్నం): కొత్తవలస-కిరందోల్‌ రైలు మార్గంలోని చిమిడిపల్లి, తైడ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలను ఎక్కడికక్కడే నిలిపేశారు. అరకు రైల్వే స్టేషన్లోనూ జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపేశారు. రైల్వే అధికారులు ట్రాక్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ముడిఇనుమును తీసుకెళ్లే సరకురవాణా రైళ్లుసైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో    ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.