చుట్టేస్తున్న కరోనా విపత్తు

Published: Wednesday April 21, 2021

చుట్టేస్తున్న కరోనా విపత్తుకు చెక్‌ పెట్టేందుకు ఎక్కడికక్కడ స్వీయ ఆంక్షలను అమల్లోకి తెస్తున్నారు. ‘ఇది ఒక్కరు చేసే యుద్ధం కాదు’ అనే స్ఫూర్తిని వ్యాపారుల నుంచి పలు జిల్లాల అధికారుల వరకు చాటుతున్నారు. కరోనా కట్టడికి తమ పరిధిలో సాధ్యమైన చర్యలన్నింటినీ చేపడుతున్నారు. à°•à°¡à°ª జిల్లా రైల్వేకోడూరులో వ్యాపార సంఘాలు సమావేశమై.. బుధవారం నుంచి మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² తర్వాత దుకాణాలు తెరవరాదని  స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరోనా నివారణ కోసం ఆంక్షలు మొదలయ్యాయి. కందుకూరులో ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర జనసంచారానికి అనుమతించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే à°ˆ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. త్రిపురాంతకంలో ఉదయం 6 నుంచి 10 à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార ఇతర కార్యకలాపాలకు అవకాశం ఇచ్చి, à°† తర్వాత అత్యవసరాలు మినహా అన్నింటినీ మూసివేయించారు. అద్దంకిలో ఈనెల 22నుంచి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకే వ్యాపారాలు అనుమతించాలని నిర్ణయించారు.

ప్రతిరోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్న గుంటూరు నగరంలో ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర నాయుడు అధికారులు, ఎమ్మెల్యేలతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే షాపులు అందుబాటులో ఉంటాయి. à°ˆ నెల 25à°µ తేదీ నుంచి రాత్రి 7 తరువాత మరుసటి రోజు ఉదయం 6 à°—à°‚à°Ÿà°² వరకు పూర్తి కర్ఫ్యూ ఉంటుంది. ఇదే జిల్లాలోని నరసరావుపేటలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్ధల ప్రతినిధులు కలిసి చర్చించి à°ˆ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం ఎనిమిది à°—à°‚à°Ÿà°² నుంచి మూడు à°—à°‚à°Ÿà°² వరకే వ్యాపార సంస్థలు పని చేస్తాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో గురువారం రాత్రి లాక్‌డౌన్‌ను విధిస్తూ రెవెన్యూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 à°—à°‚à°Ÿà°² నుంచి తెల్లవారుజామున 5 à°—à°‚à°Ÿà°² వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి ఉండదని ఆర్డీవో ఖాజావలి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని అధికారులు ఆదేశించారు. గూడూరు పట్టణంలో మధ్యాహ్నం రెండు à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఆత్మకూరులో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం రెండు  à°—à°‚à°Ÿà°² వరకే దుకాణాలు తెరవాలని ఆదేశించారు.   

కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపార ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటుచేయాలని, హ్యాండ్‌ శానిటైజేషన్‌ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని పేర్కొంది. à°ˆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.