రాష్ట్రంలో కరోనా విలయం

Published: Sunday April 25, 2021

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 10,33,560 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో కరోనాతో  69 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 7,685 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 9,36,143 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  మరోవైపు రాష్ట్రంలో కొవిడ్‌ పడగ విప్పడంతో కేసులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. నిత్యం వందలాది మందికి వైరస్‌ సోకుతుండడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తక్కువై శ్వాస సంబంధిత సమస్యలు అధికంగా ఉంటున్నాయి. దీంతో వీరంతా ఆక్సిజన్‌ పడకల కోసం పరుగులు తీస్తుండడంతో అవి నిండిపోతున్నాయి. కొత్తగా వచ్చే బాధితులకు ఏమాత్రం సరిపోక à°—à°‚à°Ÿà°² తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులకు దారితీస్తున్నాయి