ఉపాధ్యాయులకు సూచనలు

Published: Thursday April 29, 2021

ఏపీలో ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ సూచనలిచ్చింది. టెన్త్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహకరించాలని అధికారులు సూచించారు. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్‌ మార్గాల ద్వారా సహకరించాలని, విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా సందేహాలు తీర్చాలని పలు సూచనలు చేశారు. జూన్‌ 1 నుంచి 5 వరకు పాఠశాలకు రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. టెన్త్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా సూచనలిచ్చారు. పరీక్షల నిర్వహణ, సందేహాల నివృత్తి కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. టెన్త్‌ విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.