తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published: Monday May 03, 2021

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారిని నిన్న 10 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని 10,824 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.78 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 5503 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.