ఉత్కంఠకు తెరపడింది.

Published: Sunday May 09, 2021

చైనా అతి పెద్ద రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ విడి భాగాలు హిందూ మహా సముద్రంలో ఆదివారం పడ్డాయి.దీంతో దీని అవశేషాలు ఎక్కడ పడతాయోనని కొద్ది రోజులపాటు ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది.  భూమి వాతావరణంలోకి లాంగ్ మార్చ్ 5బీ ప్రవేశించడంతో దాని భాగాల్లో చాలా వరకు అంతకుముందే ధ్వంసమైపోయాయి. 

 

లాంగ్ మార్చ్ 5బీకి సంబంధించిన సమాచారాన్ని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్లడించినట్లు à°† దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. à°ˆ వివరాల ప్రకారం, à°ˆ రాకెట్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 10.24 గంటలకు (02.24 గంటలు జీఎంటీకి) భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద దీని శిథిలాలు పడ్డాయి. అంటే మాల్దీవుల సమూహానికి పశ్చిమ దిశలో మహా సముద్రంపై ఇది పడింది. అత్యధిక శిథిలాలు వాతావరణంలోనే కాలిపోయాయి. 

 

చైనాలోని హైనన్ దీవిలో ఏప్రిల్ 29à°¨ లాంగ్ మార్చ్ 5బీ పేలిపోయింది. అప్పటి నుంచి ఏం జరుగుతుందోనని చాలా మంది ఆకాశం వైపు చూస్తున్నారు. వారి ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. 

 

చైనీస్ స్పేస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, 18 టన్నుల బరువుగల à°ˆ రాకెట్ విడి భాగం ఎక్కడ పడుతుందోననే ఉత్కంఠకు తెరపడింది. దీని వల్ల నష్టం పెద్దగా ఉండబోదని చైనా అధికారులు చెప్తున్నారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ చైనాకు చెందిన కొత్త స్పేస్ స్టేషన్‌ను భూ కక్ష్యలోకి ఏప్రిల్ 29à°¨ ప్రయోగించింది. ఇది బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10.24 గంటలకు మాల్దీవులకు సమీపంలోని హిందూ మహా సముద్రంలో పడిందని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్  తెలిపింది. 

 

లాంగ్ మార్చ్ తొలి ప్రయాణం 2020 మేలో జరిగింది. ప్రస్తుతం పేలిపోయిన రాకెట్ 5బీ రకాల్లో రెండోది. à°—à°¤ ఏడాది మొదటి లాంగ్ మార్చ్ 5బీ శిథిలాలు ఐవరీ కోస్ట్‌లో పడ్డాయి. వీటి వల్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. 

 

ఇదిలావుండగా, అమెరికా మిలిటరీ డేటాను ఉపయోగించే స్పేస్ ట్రాక్ అనే మానిటరింగ్ సర్వీస్ కూడా à°ˆ లాంగ్ మార్చ్ 5బీ భూమిపైకి వచ్చినట్లు, హిందూ మహా సముద్రంలో పడినట్లు ధ్రువీకరించింది.అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది. 

 

నిపుణుల అంచనాలే నిజమయ్యాయి

భూమిపై 70 శాతం నీరు ఉండటం వల్ల లాంగ్ మార్చ్ 5బీ విడి భాగాలు సముద్రంలోనే పడతాయని కొందరు నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఆదివారం దీని విడి భాగాలు హిందూ మహా సముద్రంలో పడటంతో à°ˆ అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇంత భారీ విడి భాగం తిరిగి భూమిపైకి ఎటువంటి నియంత్రణ లేకుండా వస్తుండటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ పడుతుందో, à°Žà°‚à°¤ నష్టానికి కారణమవుతుందోనని భయపడ్డారు. అయితే అలా జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా భావించారు. 

 

చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ à°—à°¤ వారం మాట్లాడుతూ, భూమిపై దీనివల్ల హాని జరిగే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. దీనిని పరిశీలిస్తున్నవారిలో అమెరికన్, యూరోపియన్ రోదసీ నిపుణులు కూడా ఉన్నారు. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, దీనిని షూట్ చేయాలనే ప్రణాళిక ఏదీ అమెరికన్ మిలిటరీకి లేదన్నారు. అయితే ఇది కక్ష్య నుంచి జారి పడిపోవడంలో చైనా నిర్లక్ష్యం ఉందన్నారు.