కరోనా స్ట్రెయిన్‌ను ఇవ్వడానికే అవి పరిమితం

Published: Sunday May 23, 2021

 ‘‘భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్త సహకారంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా తయారీ పరిజ్ఞానాన్ని మరిన్ని ఔషధ కంపెనీలకూ బదిలీ చేయాలి’’ అంటూ ఇటీవల పలువురు వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్లా స్పందించారు. ‘‘కొవాగ్జిన్‌ టీకా భారత్‌ బయోటెక్‌దే.. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీల నుంచి మాకు వ్యాక్సిన్‌ తయారీ పరిజ్ఞానమేదీ బదిలీ కాలేదు’’ అని ఆమె పేర్కొన్నట్లు à°’à°• ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

 

à°† కథనం ప్రకారం... కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ను సేకరించి కంపెనీకి అందించడంతో పాటు పెద్ద జంతువులు, కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో సహకరించడానికి మాత్రమే ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీలు పరిమితమయ్యాయని సుచిత్ర తెలిపారు. కొన్ని పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలను నిర్వహించేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే.. à°† ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్లపై ఏర్పాటుచేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సుచిత్ర ఎల్లా  మాట్లాడారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీల నుంచి కరోనా స్ట్రెయిన్‌ అందిన తర్వాత మొత్తం పనిని చక్కబెట్టింది తామేనన్నారు. పూర్తిస్థాయిలో కంపెనీ నిధులతో, సొంత ల్యాబ్‌లలోస్ట్రెయిన్‌ను పరీక్షించడం దగ్గరి నుంచి ప్రయోగాత్మక టీకాను మనుషులపై పరీక్షించే దాకా ప్రతిచోటా భారత్‌ బయోటెక్‌ శ్రమే ఇమిడి ఉందన్నారు. ఇతర ఫార్మా కంపెనీలకు కొవాగ్జిన్‌ పేటెంట్లు, తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు. à°ˆ టీకా తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైందని, అత్యున్నత ప్రమాణాలు కలిగిన బీఎ్‌సఎల్‌-3 బయో సేఫ్టీ లెవల్‌ ల్యాబ్‌లలో దీన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

 

పిల్లలపై కొవాగ్జిన్‌ ప్రయోగ పరీక్షలు జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, à°† తర్వాత మూడు నెలల్లోగా టీకా భద్రతకు సంబంధించిన ఫలితాలు వెలువడొచ్చన్నారు. ముక్కు ద్వారా అందించే వీలున్న ఇంట్రానేసల్‌ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ ప్రయోగ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరితగతిన రెండు, మూడోదశలను కూడా పూర్తిచేస్తామని సుచిత్ర వెల్లడించారు. అయితే ఎప్పటిలోగా ముక్కు టీకా అందుబాటులోకి వస్తుందనే దాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు.