ప్రైవేట్‌ ఆస్పత్రులతో వైద్య, ఆరోగ్య శాఖ భేటీ

Published: Saturday May 29, 2021

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బ్లాక్‌ఫంగస్‌ రోగులకు యాంఫోటెరిసిన్‌ తిప్పలు తప్పనున్నాయి. స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఇంజక్షన్లు తీసుకొచ్చే బాధ్యతను ఇక నుంచి ఆస్పత్రులే తీసుకోనున్నాయి. దీన్ని సమన్వయం చేసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం à°“ కమిటీని ఏర్పాటు చేసింది. à°ˆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులతో వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సమీక్ష నిర్వహించింది.

 

à°† శాఖ కార్యదర్శి రిజ్వీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 20 కార్పొరేట్‌ ఆస్పత్రుల బాధ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో 364మంది బ్లాక్‌ఫంగస్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లు కావాలంటే.. రోగి వివరాలను ఆయా ఆస్పత్రు లు వైద్య, ఆరోగ్యశాఖకు మెయిల్‌ చేయాలి. అక్కడి నుంచి అనుమతి లభించాక ఫలానా స్టాకిస్టు వద్ద నుంచి తీసుకురావాలని చెబుతూ రోగుల బంధువులకు ప్రైవేట్‌ ఆస్పత్రులు లేఖలు ఇస్తున్నాయి. దాంతో రోగుల బంధువులు ఆస్పత్రి ఇచ్చిన లేఖను పట్టుకొని ఔషధ స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇదో ఇబ్బందికర సమస్యగా మారింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. à°ˆ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

 

యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్ల కేటాయింపును సమన్వయం చేసేందుకు కోఠి ఈఎన్‌à°Ÿà±€ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రతి రోజూ రోగుల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖకు పంపాల్సి ఉంటుంది. అలాగే, కొత్తగా చేరే రోగుల వివరాలను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లను వైద్య ఆరోగ్యశాఖ కేటాయిస్తుంది. ఇదంతా ప్రభుత్వం నియమించిన కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫలానా ఆస్పత్రిలో ఇంతమంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు ఉన్నారని, వారికి ఇన్ని యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లు ఇవ్వాలని సదరు స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లకు వైద్య ఆరోగ్యశాఖ నుంచి లేఖలు వెళ్తాయి. అదే లేఖను ఆస్పత్రికీ పంపుతారు. దాని ద్వారా కేటాయించిన స్టాకిస్టు దగ్గరకు వెళ్లి యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లు తీసుకోవచ్చు. అయితే, à°ˆ ఔషధ ధరలను రోగులే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారికి మాత్రం యాంఫోటెరిసిన్‌ ఉచితంగానే ఇస్తున్నారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 774 మంది బ్లాక్‌ఫంగస్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతి రోజూ 3500 వయల్స్‌ను మాత్రమే కేంద్రం కేటాయిస్తోందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి పదుల సంఖ్యలో ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే కోటా.. రోగులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో రోగికి ఎన్ని ఇంజక్షన్లు అవసరం ఉన్నా.. కేవలం ఐదు మాత్రమే అధికారులు కేటాయిస్తున్నారు