అంబులెన్స్‌లో కొవిడ్ మహిళ ప్రసవం

Published: Friday June 04, 2021

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావు పాలెంకు చెందిన   à°®à°‚à°—à°‚ సావిత్రి(35) 108 వాహనంలోనే ప్రసవించింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో సావిత్రికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయ్యింది. కాగా à°—à°¤ అర్ధరాత్రి పురిటి నొప్పులతో రావడంతో  ఏలూరు ఆస్పత్రికి  తరలిస్తుండగా  పూళ్ళ వద్ద సుఖప్రసవం జరిగింది. ఈఎంటీ రాజు, పైలెట్ నీలిపాల దినేష్‌లు సావిత్రికి పురుడుపోశారు. ప్రస్తుతం తల్లి, బాబు క్షేమంగా ఉన్నారు. ఇరువురిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.