సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ పేరుతో రక్తదానo

Published: Sunday June 13, 2021

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రక్తాన్ని చిందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు కేంద్రానికి చేరేలా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు జె.అయోధ్యరాం పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, à°ˆ సారి సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ పేరుతో à°ˆ నెల 14à°¨ శిబిరం నిర్వహించనున్నామన్నారు. అధికసంఖ్యలో ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వై.à°Ÿà°¿.దాసు, సింహాచలం, అప్పారావు, రామస్వామి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.