క్లాక్‌టవర్‌పై సెల్ఫీ.... ఒక్కసారిగా పిడుగుల వాన

Published: Monday July 12, 2021

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి 12à°µ శతాబ్దంనాటి అమేర్ కోటకు చెందిన క్లాక్‌టవర్‌పైకి ఎక్కి ప్రజలు నిన్న సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుల వాన కురిసింది. à°ˆ హఠాత్ పరిణామం నుంచి వారు తేరుకోకముందే 11 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు క్లాక్‌టవర్ పైనుంచి కిందికి దూకేశారు. పిడుగులు పడిన సమయంలో 27 మంది క్లాక్‌టవర్‌పై ఉన్నట్టు అధికారులు తెలిపారు.

 

పిడుగుపాటు కారణంగా మరణించిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా కోటా, ధోల్పూర్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. క్లాక్‌టవర్ నుంచి దూకిన వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లో నిన్న వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనూ పిడుగుపాటుకు దాదాపు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.