మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ

Published: Tuesday July 13, 2021

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ కేసుకు సంబంధించి మరికొన్ని పిటిషన్స్ పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అన్ని పిటిషన్స్ కలిపి విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంటూ.. తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది.