భయంతో వణికిపోతున్న పోలవరం నిర్వాసితులు

Published: Thursday July 15, 2021

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వరద భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్దిపాటి వరదకే గ్రామాలు జలమయం అవుతున్నాయన్న భయం వారిని నిలువెల్లా ఆవరించింది. గోదావరికి భారీగా వరదలు వచ్చినా ఏ మాత్రం జంకని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఈసారి ముంపు ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా చాలా గ్రామాలను నిర్వాసితులకు స్వచ్ఛందంగానే ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.