గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం

Published: Sunday July 18, 2021

రాజమంఢ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద  గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. బ్యారేజ్ నుంచి 98 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. 6.30 అడుగులు వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. తూర్పు, మద్య, పశ్చిమ డెల్టాలకు  9,600 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు.  దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్బందంలోనే ఉన్నాయి.