భర్త ప్రాణానికి తన ప్రాణం.....

Published: Sunday June 17, 2018


తన భర్తను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు తన ప్రాణం ఇచ్చింది à°“ భార్య. ఘర్షణలో భర్తపై ఎక్కడ దెబ్బ పడుతుందోనని అడ్డంగా వెళ్లి ప్రాణాలు కోల్పోయింది మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన కల్యాణి (30). గ్రామానికి చెందిన చిరంజీవి, లక్ష్మీనరసప్ప శుక్రవారం రాత్రి హిందూపురంలోని à°“ మద్యం దుకాణం వద్ద పరస్పరం దూషించుకున్నారు. సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డుకు సంబంధించి వారి మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. చిరంజీవి, లక్ష్మీనరసప్పను వ్యక్తిగతంగా దూషించడంతో కుటుంబ విషయాలపై ఎద్దేవా చేశాడు. దీంతో లక్ష్మీనరసప్ప ఆగ్రహం చెంది, హిందూపురంలో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. అక్కడ ఉన్నవారు ఇద్దరినీ పంపివేశారు. విషయం గ్రామంలో ఇరు కుటుంబాలకు తెలియటంతో శనివారం దూషించుకున్నారు. చిరంజీవి, అతడి భార్య కల్యాణి, లక్ష్మీనరసప్ప, అతడి తండ్రి నరసింహప్ప, తల్లి రామాంజినమ్మ à°ˆ విషయంపై తీవ్ర వాగ్వాదానికి దిగారు.
నరసింహప్ప.. à°šà°¿à°°à°‚జీవిపై కట్టెతో దాడి చేసేందుకు యత్నించాడు. భర్తను కాపాడేందుకు మధ్యలోకి వెళ్లిన కల్యాణి తలకు కట్టె తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావం కావటంతో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు బోరున విలపించారు. కల్యాణికి ఇద్దరు పిల్లలుండగా వారిలో ఒకరు బుద్దిమాంఽధ్యుడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు, ఏఎ్‌సఐ తిరుపాల్‌నాయక్‌ గ్రామానికి చేరుకుని, ఘర్షణపై విచారణ చేపట్టారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణ, వివాహిత మృతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.