ఈడీ ముందుకు హీరో రవితేజ

Published: Thursday September 09, 2021

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హీరో రవితేజ నేడు హాజరయ్యారు. ఆయనతో పాటు కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు. అయితే తెల్లవారుజామున నుంచి ఇంట్లో రవితేజ అందుబాటులో లేకుండా పోయారు. గెస్ట్ హౌజ్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి రవితేజ చేరుకున్నారు. అక్కడ కవరేజ్ కోసం సిద్ధంగా ఉన్న మీడియాను చూసి రవితేజ పరుగులు పెడుతూ ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.

 

ఆది నుంచి సినీ నటులు మీడియా à°•à°‚à°Ÿ పడకుండా రహస్య ప్రాంతాల నుంచి విచారణకు హాజరవుతుండటం గమనార్హం. గతంలో ఎక్సైజ్‌ అధికారులు రవితేజ, శ్రీనివాస్‌లను విచారించిన విషయం తెలిసిందే. à°† సమాచారంతో పాటు కెల్విన్‌తో ఆర్థిక సంబంధాలపైన ఈడీ ఇవాళ ప్రశ్నిస్తోంది. à°ˆ కేసులో సినీరంగానికి చెందిన 12మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్‌తో పాటు ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ 13à°¨, ముమైత్‌ఖాన్‌ 15à°¨, తనీష్‌ 17à°¨, తరుణ్‌ 22à°¨ విచారణకు హాజరుకానున్నారు.