జగన్ సర్కార్‌కు మళ్లీ దెబ్బ..

Published: Thursday September 23, 2021

 à°œà°—న్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గురువారం à°ˆ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది.