ఆనందయ్య కొత్త పార్టీ

Published: Tuesday September 28, 2021

 à°†à°¨à°‚దయ్య కొత్త పార్టీ పెట్టనున్నారు. రాజకీయ పార్టీ పెట్టాలని ఆనందయ్య నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఆనందయ్య యోచిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రధయాత్ర చేయనున్నారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని కసరత్తు చేస్తున్నారు. నెల్లూరులో కరోనా మందు తయారీతో ఆనందయ్య ప్రాముఖ్యత పొందారు. ఏపీవ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు. జిల్లాలు, గ్రామాల్లో కూడా కరోనా మందును ప్రజలకు అందజేశారు.

ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం లేదని కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసినా 13 జిల్లాల్లో కూడా ఆయుర్వేదం మందును పంపిణీ చేశారు. స్వయంగా ఆనందయ్య మందును తయారు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.