నరేష్, కరాటే కళ్యాణిలపై పోలీసులకు ఫిర్యాదు

Published: Wednesday October 06, 2021

సీనియర్ నటుడు నరేష్, క్యారక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణిలపై నటి హేమ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన తనపై ఇదే పరిశ్రమకు చెందిన నరేష్, కరాటే కళ్యాణి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభ్యంతరకరమైన పదజాలంతో తనను దూషించారని, బెదిరించడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేశారని తెలుపుతూ హేమ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో తెలిపారు. భారతీయ ఐటీ చట్టం ప్రకారం డిజిటల్ మీడియాలో ఆడవారిపై లేనిపోని కథనాలు సృష్టించి, వారిని ఇబ్బందికి గురిచేసే వారు శిక్షార్హులు కావున.. నరేష్, కళ్యాణిలపై తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఆమె à°ˆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన ప్రతిష్టకు, గోప్యతకు నష్టం కలిగించే ఇటువంటి వీడియోలను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని యూట్యూబ్ లింక్‌లను ఆమె à°ˆ ఫిర్యాదుకు జతచేశారు. ఇకపై తన ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతిసేలా వీడియోలు పెట్టేముందు నిర్థారణ చేసుకోవాలని కోరుతూ.. à°¤à°¨ ఫిర్యాదును పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను హేమ కోరారు. కాగా, అక్టోబర్ 10à°¨ జరగబోవు ‘మా’ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున వైస్ ప్రెసిడెంట్‌à°—à°¾ à°¹à±‡à°® బరిలోకి దిగారు.