జమ్ములో భారత్ ఆర్మి ప్రతీకార దాడి

Published: Thursday January 04, 2018

పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత జవాను ఆర్పీ హజ్రాను బలితీసుకున్న పాక్ సైనిక మూకలపై భారత భద్రతా దళాలు ఎదురు దాడికి దిగి ప్రతీకారం తీర్చుకున్నాయి. పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసి 12 మందికి పైగా పాక్ రేంజర్లను మట్టికరిపించాయి. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బుధవారం నాడు పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. à°ˆ కాల్పుల్లో బీఎస్ఎఫ్ దళానికి చెందిన ఆర్పీ హజ్రా ప్రాణాలు కోల్పోయారు. 50 ఏళ్ల ఆయన తన జన్మదిన వేడుక లు జరుపుకుంటున్న సమయంలొనె ప్రాణాలను సమర్పించారు దీనికి బధులుగా భారత దళాలు విశ్వరూపం ప్రదర్శించాయి. భీకర కాల్పులతో పాకిస్తాన్ సైనిక పోస్టులపై విరుచుకుపడుతూ రెండు పాకిస్తానీ మోర్టార్ పొజిషన్లను పసిగట్టి రాత్రికి రాత్రే నేలకూల్చాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో దాదాపు 12 నుంచి 15 మంది వరకు పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.