ఓ వైపు భారీ వర్షాలు..మరోవైపు ఏనుగుల దాడులు

Published: Monday November 29, 2021

 à°“ వైపు భారీ వర్షాలు..మరోవైపు ఏనుగుల దాడులతో చిత్తూరు జిల్లాలో రైతులు లబోదిబోమంటున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని తోడిగానిపల్లి గ్రామ పరిసరాల్లో వేకువజామునే ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైతులు పరుగులు తీశారు. అమ్మకానికి ఉంచిన 45 బస్తాల వడ్లను ఏనుగుల మంద తినేసింది. అంతేకాదు అక్కడ బీభత్సం సృష్టించాయి.