ఓటీఎస్‌పై టీడీపీ దుష్ప్రచారం: మంత్రి అవంతి

Published: Tuesday December 07, 2021

ఓటీఎస్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటీఎస్‌పై చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మొద్దన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్నారని, మరి 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని చంద్రబాబును మంత్రి అవంతి ప్రశ్నించారు.