పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

Published: Sunday December 19, 2021

జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. చింతపల్లిలో 5.8, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. అటు మినుములూరులో 7 డిగ్రీలు, లంబసింగిలో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు.