విశాఖలో భూవివాదం

Published: Wednesday December 22, 2021

నగరంలో రూ. 200 కోట్ల భూవివాదం చోటుచేసుకుంది. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌చైర్మన్‌ జీవీపై హయగ్రీవ ఇన్‌ఫ్రా చైర్మన్‌ జగదీశ్వరుడు తీవ్ర ఆరోపణలు  చేశాడు. ప్రభుత్వ పెద్దల పేరుతో జీవీ బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. యండాడలో రూ.200  కోట్ల విలువైన భూమిని బలవంతంగా రాయించుకున్నారని జగదీశ్వరుడు ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో రూ.500 కోట్ల కాంట్రాక్ట్‌ వర్క్స్‌లో మోసం చేశారని చెప్పారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ సహకారంతో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాపాడాలంటూ జగదీశ్వరుడు వీడియో విడుదల చేశారు. జగదీశ్వరుడు ఆరోపణలను జీవీ ఖండించారు. తాను జగదీశ్వరుడు కంపెనీకి ఆడిటర్‌à°—à°¾ పనిచేశానని తెలిపారు.