దుర్గమ్మ దర్శనానికి వచ్చి కుటుంబం ఆత్మహత్య

Published: Saturday January 08, 2022

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన à°“ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడటం విషాదాన్ని నింపింది. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా... కృష్ణా నదిలో దూకి తండ్రి, మరో కొడుకు ప్రాణాలు తీసుకున్నారు. మృతులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా భైంసాకు చెందిన పప్పుల సురేష్ (54), సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశిష్, అఖిల్‌à°—à°¾ గుర్తించారు.  ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం à°ˆ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.  ఈనెల 6à°¨ దుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వచ్చిన కుటుంబం కన్యకాపరమేశ్వరి సత్రంలో బస చేసింది. దుర్గమ్మ దర్శనం అనంతరం ఈరోజు తెల్లవారుజామున తల్లి శ్రీలత, కొడుకు ఆశిష్ సత్రంలో విషం తాగి చనిపోగా... తండ్రి సురేష్, మరో కొడుకు అఖిల్ కృష్ణానదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. à°ˆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.