ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా

Published: Friday January 14, 2022

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో జరిగిన చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2-1 తేడాతో సిరీస్ సఫారీల వశమైంది. సిరీస్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో దారుణంగా విఫలమైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.

 

ఓవర్ నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా కీగన్ పీటర్సెన్ (82) వికెట్‌ను మాత్రమే కోల్పోయి 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. డుసెన్ 41, బవుమా 32 పరుగులతో నాటౌట్‌à°—à°¾ నిలిచారు. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. తర్వాత వరుసగా రెండు టెస్టుల్లోనూ ఏడు వికెట్ల తేడాతోనే ఓడిపోవడం గమనార్హం.