కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి

Published: Wednesday February 02, 2022

 à°°à°¾à°œà°µà±Šà°®à±à°®à°‚à°—à°¿ మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారిలో వేమ లోవరాజు (28), చెదల సుగ్రీవ్ (70), లు బుసరి సన్యాసిరావు (65), పుత్తూరు గంగరాజు(36)తో పాటు మరొకరు ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏసుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో మంట, వాంతులు అయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే ఐదుగురు మృతి చెందారు. కల్తీ కల్లుపై జండంగి పోలీసులు విచారణ చేపట్టారు.