ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు

Published: Sunday June 24, 2018

కొవ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. లాంచీలరేవు దగ్గర గోదావరిలో అనుమానాస్పద స్థితిలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన పొందూరు రవికుమార్(27), పావని(24), పూజిత(3), హారిక(4)గా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.