మోదీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించిన పాక్ ప్రధాని

Published: Tuesday February 22, 2022

భారత్-పాకిస్తాన్ మధ్యనున్న వివాదాలకు స్వస్తి చెప్పి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని, అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాక్‌పై భారత్‌కు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం కోసం తాము ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.