అమలాపురం సభలో జగన్‌ ధ్వజం

Published: Wednesday June 27, 2018

అమలాపురం ;రైతుల పంటలకు మద్దతు ధరను కల్పించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను నిలువునా దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో మంగళవారం అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళారులను ప్రోత్సహిస్తూ వారి ద్వారా హెరిటేజ్‌కు రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి నాలుగు రెట్లు ఆదాయాన్ని పొందాలని సీఎం చూస్తున్నారని అన్నారు. క్రాప్‌హాలిడే ప్రకటించిన సమయంలో రైతుల పక్షపాతిగా చెప్పుకొని à°ˆ ప్రాంతానికి వచ్చిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని, రైతులకు మద్దతు ధర ప్రకటిస్తామని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటికి అతీగతీ లేదని విమర్శించారు