ఇక విశాఖలో డ్రోన్ల పరిజ్ఞానం ....

Published: Thursday June 28, 2018

విశాఖపట్నం: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేరాలు, ఘోరాలు ,రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి అంతే కాకుండా ఇతరాత్ర సంఘ విద్రోహక కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నాయి .విశాఖలో సగభాగం సముద్ర తీరం కావడంతో సంఘ విద్రోహక శక్తులు సముద్రమార్గంలో నగరంలోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి .అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉద్దేశించుకొని అప్రమత్తం అయ్యింది .ఇటీవల సింగపూర్ వెళ్లిన మంత్రి నారా లోకేష్ అక్కడ డ్రోన్ల సహాయంతో పెట్రోలింగ్ సహాయంతో జరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ,వెంటనే సింగపూర్ మంత్రి డెస్మాన్ లీ తో దీని గురించి సుదీర్ఘంగా చర్చించ్చారు .విశాఖ సముద్ర తీరంలో జరుగుతున్న ఆత్మ హత్యలు ,నేరాలు,ఘోరాలు అవగతం చేసుకున్నడెస్మాన్  లీ, తమ దేశం లో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశానికి అందిస్తామని నారా లోకేష్ కు హామీ ఇచ్చారు