ఫోన్‌నెంబర్ మార్చి నగదు స్వాహా

Published: Friday June 29, 2018

నగరంలో à°“ వ్యక్తి సైబర్ మోసానికి పాల్పడ్డాడు. ఖాతాదారుడికి తెలియకుండా బ్యాంక్‌లో ఫోన్‌ నెంబర్‌ మార్చిన దుండగుడు అకౌంట్‌లోని రూ. 3 లక్షల నగదును పేటీఎంలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. నగదు విత్‌డ్రా అయినట్లు గుర్తించిన బాధితురాలు గాయత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్‌వాసిగా గుర్తించారు.