నూనె కొంటున్నారా !! అయితే జాగ్రత్త మరి ..........

Published: Tuesday July 03, 2018

నేరేడుచర్ల(సూర్యాపేట): à°¨à±‚నె దుకాణాల్లో పచ్చి మోసాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేపడుతున్నా వారి తీరులో మార్పు రావట్లేదు. ఫలితంగా సామాన్యులు à°† నూనెతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. తాజాగా అధికారుల ఫోరెన్సిక్‌ నివేదికలో నేరేడుచర్ల నూనె దుకాణాల్లో కల్తీ జరిగినట్లు తేలింది. మండల కేంద్రంలోని రెండు నూనె దుకాణాల్లో 2016 సంవత్సరం ఏప్రిల్‌ 14à°¨ పోలీసులు కేసులు నమోదు చేశారు. నూనె నాసిరకంగా వుందని అనుమానంతో వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం నివేదికలు పోలీసులకు అందడంతో కేసులు నమోదు చేశారు. జంతువుల నుంచి తీసిన కొవ్వు, కూరగాయల నుంచి తీసిన నూనెను పల్లీ నూనెలో కలిపి విక్రయిస్తున్నట్లు నివేది కలో తేలింది.