పవన్ కి బెదిరింపులు

Published: Monday July 09, 2018

కారును యాక్సిడెంట్‌ చేస్తామని, కాన్వాయ్‌ని పేల్చేస్తామని ఇలా తనకు ఎన్నో బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. అయితే అన్నింటికీ సిద్ధపడే కోట్ల ఆదాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనసైనికులు కూడా త్యాగాలకు సిద్ధం కావాలంటూ పవన్‌ పిలుపునిచ్చారు.

 

ప్రజలే తన కుటుంబంగా భావించి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆదివారం రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. à°ˆ సందర్భంగా à°—à°¤ నెలలో పాయకరావుపేటలో పార్టీ ఫ్లెక్సీలు కడుతూ, విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన జనసేన కార్యకర్తలు భీమవరపు శివ, తోలెం నాగరాజు కుటుంబాలకు చెరో మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. శివ కుమారుడికి అనిరుధ్‌ అని, నాగరాజు కుమారుడికి గౌరీశంకర్‌ అని నామకరణం చేశారు. నాగరాజు శివభక్తుడు కాబట్టి ఆయన కుమారుడికి గౌరీశంకర్‌ అని పేరు పెట్టానని పవన్‌ పేర్కొన్నారు. à°ˆ చిన్నారులకు తాను à°…à°‚à°¡à°—à°¾ ఉంటానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జనసైనికులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారికి ఏదైనా జరిగితే తాను తట్టుకోలేనన్నారు.